నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ, ఎన్నో రోజుల క్రితం విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల వల్ల అనేక సార్లు విడుదల తేదీని ప్రకటించి కూడా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది, ఈ సినిమా పై విడుదలకు ముందు కూడా జనాలలో మంచి ఆసక్తి నెలకొని ఉంది, దానికి ప్రధాన కారణం ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్, ట్రైలర్, టీజర్, పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం.

ఇలా ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన లవ్ స్టోరీ సినిమా జనాలు ఆశించినట్లుగానే మంచి టాక్ తో ముందుకు దూసుకుపోయింది. నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంగా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని కూడా అఫీషియల్ గా ఆహా నిర్వహణ బృందం ప్రకటించింది. అయినప్పటికీ లవ్ స్టోరీ సినిమాకు జనాల నుండి మాత్రం థియేటర్లలో ఆదరణ తగ్గడం లేదు. అయితే ఇలా జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఒక రికార్డు ను తాజాగా అందుకున్నట్లు ఏ ఎం బి సినిమాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. లవ్ స్టోరీ సినిమా 251 షో లకు గాను 48233 చూసినట్లు అందుకుగాను కోటి రూపాయల గ్రాస్ వచ్చినట్లు ఏ ఎం బి సినిమా వారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇలా కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసినట్టు ఏ ఎం బి సినిమాస్ వారు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: