టాలీవుడ్ లో మహేష్ బాబు ఈ మధ్య కాలంలో కాస్త విజయాల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సినిమా విజయం సాధిస్తే మరో సినిమా విజయం సాధిస్తుందో లేదో అనే కంగారు మహేష్ బాబులో  ఎక్కువగా ఉంది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమా అనుకున్న విధంగా విజయం సాధించకపోవడం నష్టాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. వసూళ్ల విషయంలో చిత్ర యూనిట్ ఎన్ని విధాలుగా చెప్పినా సరే మహేష్ బాబు మాత్రం సినిమా విషయంలో మనో వేదన పడ్డారు అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలం గా కనబడుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా హీరోయిన్ గా కృతిసనన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే మహేష్ బాబు భార్య మాత్రం ఆ  హీరోయిన్ తో సినిమా వద్దు అని చెప్పేసిన్నట్టుగా తెలుస్తోంది.

గతంలో ఆ  హీరోయిన్ తో మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో చేసిన సినిమా ఘోరంగా విఫలం కావడం హీరోయిన్ ఇతర భాషల మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడ ఎక్కువగా సినిమాలు చేయడం వంటివి మహేష్ బాబు భార్య కు ఏమాత్రం నచ్చలేదు కాబట్టి ఆమె కాకుండా మరొకరిని ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఆమె సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ ఎవరైనా పర్వాలేదు అని టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్లు ఎవరైనా ఇబ్బంది లేదని కానీ ఆమె మాత్రం వద్దని గట్టిగా చెప్పినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: