అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకున్న హీరో జగపతిబాబు. ఎన్నో సంవత్సరాల తర్వాత బాలయ్య తో కలిసి లెజెండ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు జగపతిబాబు. ఇక అప్పట్నుంచి ఈయన విలన్ గానే సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తన రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

అలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా కంటే వీలన్ గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. ఈ హీరో హీరో గా కంటే విలన్ గా ఉన్నప్పుడే ఫుల్ బిజీగా అయిపోయాడు. దీంతో ఇక్కడ బోర్ కొట్టి  హిందీ తెరమీదకు కూడా త్వరలో వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అక్కడ కూడా ఒక భారీ ప్రాజెక్టుల్లో కనిపించబోతున్నాడు అన్నట్లుగా సమాచారం. ఒకవేళ ఆ సినిమా కూడా హిట్ అయితే ఇక జగపతిబాబుకు అక్కడ కూడా తిరుగులేదని సమాచారం.

హిందీ బడా మూవీ లో మన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపించనున్నట్లు సమాచారం. హీరోగా అయితే అక్కడి సార్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో జగపతిబాబు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్త బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కూడా"పుకార్"అనే టైటిల్ ను పెట్టనున్నట్లు గా సమాచారం.


ఈ మూవీకి డైరెక్టర్ గా ఆశుతోష్ గోపికల్ వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు గా తెలుస్తోంది. ఒకవేళ రాబోయే రోజుల్లో జగపతి బాబు హిందీ సినిమాలతోనే బిజీగా అవుతాడేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో హిందీలో బడా ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేసేవాడు. కానీ ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమాకైనా సరే అని అని చెబుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: