నాంది సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అల్లరి నరేష్. ఈవివి సత్యనారాయణ కుమారుడిగా అల్లరి సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైన నరేష్ తన తొలి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. మొదట్లో కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన ఈ హీరో ఒకే రకమైన సినిమాలను చేసి కొన్ని సినిమాల తర్వాత ప్రేక్షకులు బోర్ కొట్టించాడు.

ఆ విధంగా తాను ఒకే రకమైన జోనర్ లోని సినిమాలను కాకుండా వివిధ రకాల జోనర్ లలో సినిమాలు చేయాలని చెప్పి ఆయన తొలిసారిగా సీరియస్ జోనర్లో నాంది అనే సినిమా చేశాడు. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఉత్కంఠభరితమైన ఆసక్తి పరిచిన సినిమాగా నిలవగా ఈ చిత్రాన్ని ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ చేయడం విశేషం. అంతకు ముందు అల్లరి నరేష్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించగా దానికి గాను ఆయనకు మంచి పేరు వచ్చింది.

వెంటనే సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లరి నరేష్ కు పోయిన క్రేజ్ మళ్ళీ తిరిగి వచ్చింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సభకు నమస్కారం అనే ఓ పొలిటికల్ సినిమాలో ఆయన చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సగభాగం పూర్తి కాగా ఈ చిత్ర నిర్మాత కోనేరు మహేష్ ఇటీవలే పరమపదించారు. దాంతో ఈ సినిమా పరిస్థితి ఏంటనే ఆందోళన ఇప్పుడు అల్లరి నరేష్ అభిమానుల్లో నెలకొంది. మరి వారి కుటుంబ సభ్యులు ఈ సినిమాను తెరకెక్కిస్తారా లేదా వేరే నిర్మాత ఎవరైనా ఈ సినిమా ను టేకప్ చేసి విడుదల చేస్తారా అల్లరి నరేష్ చొరవ తీసుకుంటేనే ఈ విషయం ముందుకు కదలదు. మరి సభకు నమస్కారం సినిమా ఎప్పుడు ముందుకు వెళ్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: