ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా క్రేజీ డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హ‌రిహ‌ర‌వీర‌మల్లు సినిమాలో న‌టిస్తున్న హాట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ తాజాగా ఓ ఇంట‌ర్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. హ‌రిహ‌ర వీర‌మల్లు సినిమాలో తాను పంచ‌మి అనే ఓ యువ‌రాణి పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు నిధి అగ‌ర్వాల్ వెల్ల‌డించింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ గ్లామ‌రస్ పాత్ర‌ల‌తో అల‌రించిన తాను ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌డం మొద‌టి సారి అంటూ వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో త‌న పాత్ర ఎంతో వైవిధ్య‌భ‌రితంగా ఉండ‌బోతుందంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈ పాత్ర చేయ‌డం త‌న‌కు శారీర‌కంగా కూడా ఎంతో స‌వాల్ తో కూడుకున్న‌ది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. 

పంచ‌మి పాత్ర కోసం తాను చాలా బ‌రువైన ఆభ‌రణాలు మోయ‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని అవి మోయ‌డ‌మే త‌న‌కు పెద్ద స‌వాల్ గా మారింద‌ని చెప్పింది. ఒక షాట్ పూర్తి అవ్వ‌గానే జాగ్ర‌త్త‌గా ఒక ప్ర‌దేశంలో కూర్చోవ‌డం త‌ప్ప విశ్రాంతి ఉండ‌దంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే ఆ క‌ష్టాన్ని ఎంతో విలువైన‌దిగా భావిస్తున్నాన‌ని ఎందు కంటే ఈ సినిమా ఓ అద్భంతం అంటూ అందాల నిధి వ్యాఖ్యానించింది. ఇలాంటి అద్భుత‌మై సినిమాలో న‌టించడం త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటూ నిధి చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండ‌గా ప‌వర్ స్టార్ కూడా ఇప్పటి వ‌ర‌కూ హరిహ‌ర‌వీర‌మల్లు లాంటి సోషియో ఫాంట‌సీ సినిమాలో న‌టించ‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు ఈ సినిమాకు క్రిష్ లాంటి క్రేజీ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తుండ‌టంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా ఈ నెల 25 నుండి త‌దుప‌రి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా రాబోయే షెడ్యూల్ లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: