టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. పెళ్లిచూపులు అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన విజయ్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా యూత్ ని ఓ ఊపు ఊపేసింది. ఇక దీంతో విజయ్ దేవరకొండ కి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఇక ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీ వాలా, వంటి చిత్రాలతో తన క్రేజ్ ని పెంచుకున్నాడు. 

ఇక ప్రస్తుతం డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక అతని సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పూరి జగన్నాథ్ చార్మి లతోపాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటూ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే బుధవారం రాత్రి జరిగిన 'రౌడీ బాయ్స్' సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో విజయ్ ధరించిన టీ షర్ట్ ధర అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ఈవెంట్ లో జీరో టాలరెన్స్ గ్యాంగ్ స్టర్ స్వేట్ టీ షర్ట్ లో కనిపించాడు. ఇక మన ఇండియాలో దీని ధర రూ.10,500.. అంత తక్కువ రేట్ ఉన్న టీ షర్ట్ విజయ్ ధరించాలడని తెలిసి అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ఇక స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయ్ దేవరకొండ ఓ బట్టల దుకాణం కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఇటీవలే 'ఏవీడీ' అనే మల్టీప్లెక్స్ ను కూడా లాంచ్ చేశాడు. అది కూడా ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక లైగర్ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి పలు క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు విజయ్ దేవరకొండ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: