యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా ల తో పాటు హోస్టు గా కూడా రాణిస్తున్నాడు. అతను ముందుగా బిగ్ బాస్ అనే షోకు వ్యాఖ్యాత వ్య‌వ‌హ‌రించాడు. దీని త‌ర్వ‌త ప్ర‌స్తుతం జెమినీ టీవీ లో వ‌స్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షోకు కూడా హోస్టు గా చేస్తున్నాడు. అయితే ఈ షో కు గ‌తంలో వ‌చ్చిన‌ట్టు ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ రావ‌డం లేదు. ఈ షో వ‌చ్చిన మొద‌ట్లో విప‌రీతంగా టీఆర్పీ రేటింగ్ వ‌చ్చేది. కానీ కొన్ని రోజుల త‌ర్వాత రోజు రోజు రేటింగ్ ప‌డి పోతు వ‌స్తుంది. దీంతో తారక్ ఈ షో నిర్వ‌హిండం లో కాస్త విఫ‌లం అవుతున్నార‌ని గ‌తంలో వార్తలు కూడా వ‌చ్చాయి. అయితే ఎవ‌రు మీ కోటీశ్వ‌రులు షో కు టీఆర్పీ రేటింగ్ లు త‌గ్గ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.



ఐపీఎల్, టీ 20 క‌ప్ లు వ‌రుస‌గా రావ‌డం తో పాటు జెమీని టీవీ కూడా పెద్ద‌గా పాపులారీటి ఉన్నఛాన‌ల్ కాక‌పోవడం అని కూడా చెప్పాలి. అందు వ‌ల్ల కూడా ఈ షో కు రేటింగ్స్ రాక‌పోవ‌చ్చు అని అంటున్నారు. అయితే ఏది ఏమైన తారక్ ఈ షో నుంచి త‌ప్పు కుంటున్నాడు అనే వార్తలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. దీనికి కార‌ణం షోకు తక్కువ రేటింగ్స్ రావ‌డ‌మేన అని కొంత మంది అనుమానిస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఎన్టీఆర్ కు షూటింగ్స్ ల‌ను డేట్స్ స‌రిపోవ‌డం లేదు. అందుకే ఈ షో నుంచి త‌ప్పు కుంటున్నాడు అని అంటున్నారు. అయితే ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షో కు సంబంధించి మొత్తం 60 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి అయినట్టు స‌మాచారం. అందు కోసం యంగ్ టైగ‌ర్ రూ. 7.5 కోట్లు రెమ్యూన‌రేష‌న్ కూడా అందు కున్నాడ‌ని తెలుస్తోంది. అయితే వ‌చ్చే సిజన్ కు ఎన్టీఆర్ అందు బాటు లో ఉంట‌డో లేదో చూడాలి మ‌రి.  




మరింత సమాచారం తెలుసుకోండి: