టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్పెయిన్లో ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడే సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలను కూడా పూర్తి చేస్తున్నారు దర్శకుడు పరశురామ్. మహేష్ బాబు, కీర్తి సురేష్ ల పై రెండు పాటలను అక్కడి ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

ఇక ఈ రెండు పాటలు కూడా సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నవంబర్ 4న దీపావళి సందర్భంగా అభిమానుల కోసం సర్కారు వారి పాట టీం స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ అని దీపావళి రోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ విషయాన్ని ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ పాటకు మంచి ట్యూన్స్ ట్రాక్ కుదిరాయని ఈ పాట సాహిత్యం కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పకనే చెప్పాడు తమన్.

ఇక ఇదే కనుక నిజమైతే  మహేష్ ఫాన్స్ కి దీపావళి ట్రీట్ అది పోవడం ఖాయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.అటు గీత గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు మహేష్. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: