నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా  మాస్ దర్శకుడు  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా లో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ రైతుగా, అఘోరా గా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే బాలకృష్ణ ఈ సినిమాలో చేయబోయే ఈ రెండు పాత్రలకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్ర బృందం బయటకు వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటికి బయటికి వదిలిన ఒక లిరికల్ సాంగ్ కు కూడా జనాలు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఇలా జనాల్లో ఇప్పటికే ఫుల్ హైప్ ను క్రియేట్ చేసిన అఖండ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి, ఇదిలా ఉంటే దీపావళి పండుగ దగ్గరికి వస్తున్నా కూడా ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ సినిమా దీపావళికి విడుదల కావడం కష్టమే అని చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం తెగ వార్తలు వస్తున్నాయి, దానికి ప్రధాన కారణం బాలకృష్ణ సంక్రాంతి పండుగకు ఎన్నో సార్లు తన సినిమాలను విడుదల చేసి బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్సాఫీస్ వద్ద అందుకున్నాడు, అదే కారణంతో ఈ సినిమాను కూడా బాలకృష్ణ సంక్రాంతి బరిలో ఉంటే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: