గత కొంత కాలంగా మీడియాలో ఏదైనా హాట్ టాపిక్ నడుస్తుంది అంటే..అదే ఒక్కటే. అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం. మొదట్లో వీళ్ల మధ్య ఏదో జరుగుతుంది కానీ బయటకు రావడం లేదు అని గుసగుసలు వినిపించాయి. ఆ తరువాత మెల్ల గా నాగచైతన్య-సమంత దూరంగా ఉంటున్నారు..వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్నారు. ఆ తరువాత ఒక్క అడుగు ముందుకు వేసి..వామ్మో అక్కినేని నాగర్జున పెద్ద కొడుకు విడాకులు తీసుకుంటున్నారట అనే రూమర్ మొదలైంది.

ఇక అప్పటి నుండి అటు ప్రింట్ మీడియా..ఇటు వెబ్ మీడియా రెండింటిల్లోను అక్కినేని నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నారటహో అని డప్పు కొట్టి మరి ప్రచారం చేసారు. ఇక ఈ మీడియా బాధలు పడలేకో..లేక వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి ఆ రోజే అందరికి చెప్పుదాం అనుకున్నారో తెలియదు కానీ..సరిగ్గా వాళ్ల పెళ్లి రోజుకు నాలుగు రోజుల ముందు..ఇద్దరు ఒక్కటే మాటగా మేము విడిపోతున్నాం..దయచేసి మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అని చెప్పుకొచ్చారు.

ఇంత వరకు బాగానే ఉంది కానీ ఆ తరువాత మీడియాలో వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారు అంటూ చర్చలు,డిబేట్ లు,పోల్స్ అన్ని నడిపారు. కొందరు అయితే సమంత కు అక్రమ సంబంధం కూడా అంటగట్టారు. ఇక అలాంటి వార్తలతో విసిగిపోయిన సమంత.. డైరెక్ట్ కోర్టు లోనే తేల్చుకుంటాం అంటూ..కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావ వేసింది. సోషల్ మీడియాల్లో నాపై తప్పుడు వార్తలు రాసారంటూ  సమంత  కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను వీలైనంత  త్వరగా విచారించాలని సమంత తరఫు న్యాయవాది గురువారం ఆ కోర్టు జడ్జికి స్పెషల్ రిక్వెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఆ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసిన్నట్లు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఆ జడ్జీ న్యాయవాది పై ఫైర్ అయ్యిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్టు ముందు సామాన్యులైనా, సెలబ్రిటీలైనా  అందరూ సమానమేనని.. కోర్టు సమయం చివరలో పిటిషన్‌పై విచారిస్తామని ఆయన స్పష్టం చేశారట..దెబ్బకు ఆ న్యాయవాది సైలెంట్ అయిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి: