పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నేషనల్ యాక్టర్ రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న మళయాలి రీమేక్ అయిన 'భీమ్లా నాయక్' అని అందరికి తెలుసు.


ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయిందనీ అందుకే డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయమని ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నాయనీ సమాచారం.అమెజాన్ మరియు జీ5 వంటి ఓటీటీ సంస్థలు మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ తో ఈ సినిమా నిర్మాతల చుట్టూ తిరుగుతున్నాయనీ తెలుస్తుంది.


ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ సినిమాకి 150 కోట్ల వరకు భారీ ఆఫర్ వచ్చిందనీ సమాచారం.అయితే, ఈ సినిమా కోసం నిర్మాతలు కూడా వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారనీ మెయిన్ గా యాక్షన్ సన్నివేశాలను భారీగా తెరకెక్కిస్తున్నారనీ అందుకే, భారీ ఆఫర్ వచ్చినా తమ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరనీ తెలుస్తుంది.

బాహుబలి కి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా కూడా కలెక్షన్స్ ను రాబడుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారనీ తెలుస్తుంది.పైగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి ఈ సినిమాలో విభిన్నంగా కనిపించబోతున్నారనీ ఈ కారణంగానే జనంలో ఈ సినిమా పై చాలా పాజిటివ్ కామెంట్స్ వినబడుతున్నాయనీ సమాచారం.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేశారనీ తెలుస్తుంది.


అయితే, 'సర్కారు వారి పాట'తో పాటు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నాయనీ కాబట్టి.. రిలీజ్ డేట్ ను మారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారనీ తెలుస్తుంది.. ఇక భీమ్లా నాయక్ ఫస్ట్ టీజర్ ను పవన్ పై స్పెషల్ గా కంపోజ్ చేయడం మరీ ముఖ్యంగా పవన్ చాలా ఆవేశంగా నడుచుకుంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా మెప్పించిందనీ తెలుస్తుంది..


మొత్తానికి భీమ్లా నాయక్ గా పవన్ మరియు డ్యానియల్ శేఖర్ గా రానా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారనీ తెలుస్తుంది.. ఈ సినిమా ఈగో మీద నడవబోతుందనీ నువ్వా - నేనా అంటూ పోటీ పడే ఇద్దరి ఆవేశపరుల కథ అని అందరికి తెలుసు.. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడనీ స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: