రెబల్ స్టార్ వారసుడిగా సీనియర్ హీరో కృష్ణం రాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మొదట్లో తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ ఎన్నో సూపర్ హిట్ విజయలను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తోపాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటి నుంచి వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే చేస్తూ వచ్చాడు డార్లింగ్. అయితే సాహో చిత్రం కొంత నిరాశ పరిచింది.

ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కాగా నేడు ఆయన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల కు సంబంధించి న అప్డేట్ లు విడుదల కాగా మిర్చి సినిమా లోని ప్రభాస్ చెప్పిన ఓ డైలాగ్ ఆయన సినిమా కెరియర్ కు ఫర్ ఫెక్ట్ గా సరిపోతుందని అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే ప్రభాస్ పలికిన డైలాగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

నిజంగా ఈ డైలాగు చెప్పేటప్పుడు ప్రభాస్ కూడా అనుకోని ఉండడు ఆయన కటౌట్ చూసి ఇప్పుడు భారీ బడ్జెట్ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని. ఆయన హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం జనవరి 14 వ తేదీన విడుదల కాబోతుంది. ఇంకా ప్రాజెక్టు కే, సలార్, ఆది పురుష్, స్పిరిట్ వంటి అతి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.  ఆయన కటౌట్ చూసే ఈ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్నాయి అని చెప్పవచ్చు. పోస్టర్ మీద కేవలం ప్రభాస్ ఫోటో చూసి కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సినిమాలు చూడటానికి వెయిట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: