ఈ సినిమాలో కొంచెం హీరోయిన్ ప్రాధాన్యత ఉండడంతో కొత్త ఫేస్ ఉండాలని ఇలా చేశారు. ఇందులో కృతి నటన బాగున్నా సినిమా ప్లాప్ అయ్యింది. మాములుగా సినిమా ప్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ అందరిమీదా పడుతుంది. ముఖ్యంగా హీరోయిన్ ను ఐరన్ లెగ్ అని వివిధ పేర్లు పెడుతూ ముందు సినిమాల్లో వారిని తీసుకోవాలంటే వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా మళ్లీ వేరే సినిమాలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నాగచైతన్య హీరోగా చేసిన "దోచేయ్" సినిమాతో మళ్లీ రెండవ సారి టాలీవుడ్ లో మూవీ చేసింది కృతి సనన్. అయితే నాగ చైతన్య కూడా ఈమె ఫేట్ ను మార్చలేకపోయాడు. ఈ సినిమా ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ రెండు ప్లాప్ లతో కృతి సనన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.
అయితే అప్పుడే ఈమె గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈమె గురించి చర్చలు మొదలయ్యాయి. ఎందుకో తెలుసా, మన టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒక సినిమా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ మొదటి సారి ఇలాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కృతి సనన్ ప్రభాస్ కు జోడీగా సీత పాత్రను చేస్తోంది. అయితే ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కు తలనొప్పిగా మారింది. ఇప్పటికీ ఈమె తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్ లు అయ్యాయి. అధిపురుష్ పరిస్థితి ఏమిటి అంటూ ఆలోచిస్తున్నారు. మరి వరుసగా మూడవ ప్లాప్ వస్తుందా ? లేదా ఈ సినిమాతో హిట్ కొట్టి తన పేరు టాలీవుడ్ లో తనపై ఉన్న ఐరన్ లీగ్ ముద్ర చెరిపి వేస్తుందా అన్నది చూడాలి.