రీతూ వర్మ.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. మొదట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తన సినీ కెరీర్ స్టార్ట్ చేసిన రీతూవర్మ , ఆ తర్వాత నానితో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది..ఇక ఈమెకు మంచి గుర్తింపు వచ్చిన సినిమా మాత్రం పెళ్లిచూపులు చిత్రం అని చెప్పవచ్చు.. పెళ్లి చూపులు సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అయితే దక్కించుకోలేకపోయింది.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మాత్రం సినీ ఇండస్ట్రీలో రాకెట్ లా దూసుకుపోతుంటే , రీతూ మాత్రం అవకాశాల కోసం గత కొంత కాలంగా ఎదురు చూస్తూనే వచ్చింది..


అయితే ఎలాగైనా సరే తన సినీ కెరీర్ ను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో, తమిళ్లో విక్రమ్ తో గౌతమ్ మీనన్ రూపొందించిన ఒక తమిళ చిత్రానికి రీతూవర్మ అంగీకరించి , తన కెరియర్ కి తానే బ్రేక్ లు వేసుకుంది అని చెప్పవచ్చు. ఇక అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్న రీతూవర్మ కు అదృష్టం వచ్చింది అని చెప్పాలి.. ఎందుకంటే ఇటీవల వరుస చిత్రాలతో ఈ నటి బిజీ అయిపోయింది.. నానితో కలిసి టక్ జగదీష్ సినిమాలో నటించిన రీతూవర్మ..ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ, అమెజాన్ ప్రైమ్ లో డైరెక్టుగా విడుదలై పర్వాలేదనిపించుకుంది.
ఇప్పుడు ఈమె యంగ్ హీరో నాగ శౌర్య తో వరుడు కావలెను అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి తొలి పరిచయం కాబోతోంది.. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ వరుడు కావలెను చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలోని చిత్రబృందం ఒక సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించింది.. ఈ కార్యక్రమానికి పూజాహెగ్డే చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా, ఈ సినిమా  హీరోయిన్ రీతూ వర్మ ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్  గా నిలిచింది. చూస్తూ ఉంటే బుట్ట బొమ్మ కి ఎసరుపెట్టే అంత హాట్ గా రీతూవర్మ కనిపిస్తోంది అంటూ అబ్బాయిల నుంచి  కామెంట్ లు వచ్చిపడుతున్నాయి..ఒక తెలుగు అమ్మాయి మరింత స్టార్ స్టేటస్ అందుకోవాలని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: