కరోనా పుణ్యమా అని పెద్ద పెద్ద సినిమాల నిర్మాతలు సైతం ఓ టీ టీ లో తమ సినిమా లను  విడుదల చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ హీరో అయిన ధనుష్ మరియు సూర్య లు వరుసగా తమ సినిమాలను ఓ టీ టీ లో నే విడుదల చేస్తూ ఉండడం ఒకింత ఫ్యాన్స్ కు ఆనందం వేస్తున్న కూడా మరో వైపు అదే ఫ్యాన్స్ కు నిరాశ ను కూడా కలిగిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చిత్రాలు ఇటీవల కాలంలో అన్ని కూడా ఓటీ టీ కే అంకితం అవుతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ధనుష్ ఎక్కువగా ఓ టీ టీ కే మొగ్గు చూపారు.

జగమే తంత్రం, కర్ణన్, అసురన్ వంటి చిత్రాలు థియేటర్ రిలీజ్ కాకుండా ఓ టీ టీ లోనే విడుదల అవుతున్నాయి. థియేటర్ రిలీజ్ కోసం సమయం వృధా చేసుకోకుండా తెలివిగా సేఫ్ జోన్ లోకి వెళ్లారు ధనుష్ అండ్ హిజ్ టీమ్. వాస్తవానికి ఆ సినిమాలు కూడా థియేటర్ లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయేమో అని ఓ టీ టీ నిర్ణయం తీసుకుని అలాగే విడుదల చేయడం ఇప్పుడు ధనుష్ తెలివికి మెచ్చు కోవాలి. అలా ధనుష్ ఓ టీ టీ స్టార్ గా కోలీవుడ్ లో నిలిచిపోయాడు. ఆయన తదుపరి చిత్రం 043 కూడా ఓ టీ టీ లోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. 

ఇప్పుడు మరో హీరో సూర్య కూడా తన తదుపరి చిత్రాన్ని వరుసగా రెండో చిత్రాన్ని ఓ టీ టీ లో విడుదల చేస్తున్నాడు. జై భీమ్ సినిమా ఓ టీ టీ కోసమే నిర్మించినట్లుగా ఆయన చెబుతున్నాడు. ఆకాశమే నీ హద్దురా సినిమా సమయంలో సూర్య పై డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆందోళన వ్యక్తపరిచారు. తమకు డబ్బులు వచ్చే సినిమాలను ఆ విధంగా ఓ టీ టీ లో విడుదల చేయడం ఏమాత్రం బాగోలేదని ఆయన పై డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేయగా ఇప్పుడు వరుసగా రెండో సినిమా ను కూడా నవంబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. దీంతో ఈయన చిత్రాలు ఇలా విడుదల అవుతూ ఉండడం వల్ల మరో ఓ టీ టీ  స్టార్ గా సూర్య ను అభివర్ణిస్తున్నారు తమిళనాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: