రెండేళ్ల క్రితం వినయవిధేయ రామ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజగా అలానే ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా డివివి దానయ్య ఈ సినిమాని ఎంతో భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో మొదలు కానుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారు.

ఐతే దీని తరువాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణే లో ప్రారంభం అయింది. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుండగా దీని తరువాత యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో యువి క్రియేషన్స్ వారి సంస్థలో చరణ్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు. ఇటీవల దీని అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఇక దీని అనంతరం దానయ్య నిర్మాతగా కెజిఎఫ్ సినిమాల దర్శకడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయనున్నారు చరణ్. ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ సినిమాల తరువాత మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో కూడా ఒక సినిమాకూడా చేయనున్నారట చరణ్. టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా స్టోరీ ఇటీవల ఓకె కాగా, ప్రస్తుతం లోకేష్ దీని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని, అది పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయని చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే చరణ్ మరొక బడా మూవీ ఒకే చేసినట్లే అంటున్నాయి సినిమా వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: