ఆయన ఇప్పటికే బుల్లితెరపై హోస్ట్ గా పలు షోలకి వ్యవహరించారు. ఆయన చేసిన బుల్లితెర షోలను చేస్తే మనకే అర్ధం అవుతుంది ఆయన ఎంత బాగా హోస్ట్ చేశారో అన్న విషయం. ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలకు హోస్టుగా చేస్తున్నారు. అయితే ముందుగా హిందీలో ప్రసారమైన ఈ షోను గతంలోనే తెలుగు బుల్లితెరపై “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారం చేయగా నాగార్జున, చిరంజీవి హోస్టులుగా చేసిన సంగతి అందరికి తెల్సిందే.
అయితే కొంత గ్యాప్ తీసుకుని “ఎవరు మీలో కోటీశ్వరులు” అంటూ ఆ షో పేరును కాస్త అటుఇటుగా మార్చి, అదే గేమ్ ప్లాన్ తో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్నారు. అయితే ఈ షో ప్రారంభంలో మంచి రేటింగ్లతో దూసుకెళ్ళిపోయింది. కానీ.. రోజురోజుకు ఈ షోకు రేటింగ్స్ దారుణంగా పడిపోతుండంతో షోకి స్టార్స్ ను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఎట్టకేలకు “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగ్ కి ముగింపు చెప్పారు. ఇక ఎన్టీఆర్ కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా తాను షోని కంటిన్యూ చేయనని మేకర్స్కి చెప్పినట్లు సమాచారం. ఈ షోకి సూపర్ స్టార్ మహేష్, దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ తాజా అతిథులుగా పాల్గొన్న ఎపిసోడ్ లను త్వరలోనే ప్రసారం కానున్నట్లు సమాచారం.