ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది శృతి హాసన్. కమల్ హాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోయింది. కానీ అంతలో మ్యూజిక్ మీద ఆసక్తితో సినిమాలకు దూరమై పోయింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ వర్కౌట్ కాక పోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చేసింది. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సొగసరి.


 ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో మరోసారి ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది శ్రుతిహాసన్. అంతేకాదు ప్రస్తుతం వరుస అవకాశాలు కూడా అందుకుంటూ బిజీ బిజీ హీరోయిన్గా మారిపోయింది శృతిహాసన్. ఇక ప్రభాస్ తో నటిస్తున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


 తన లో తనకి నచ్చేది తన నిజాయితీ అని చెబుతోంది శృతిహాసన్. నిజాయితీగా ఆలోచించడంతో పాటు ప్రతి రోజు తాను ఓ పాఠం నేర్చుకుంటాను అంటూ చెబుతోంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ఎలాంటి కంగారు పడకుండా ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తాను అని చెబుతోంది. ఎదుటివారి నుంచి కాకుండా నా నుంచి నేను ఆత్మ విమర్శన చేసుకోవడం మొదలు పెడతానని ఇక ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శృతిహాసన్ అటు అప్పుడప్పుడూ అభిమానులతో చిట్ చాట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: