సీనియర్ హీరోయిన్ శ్రేయ శరణ్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తన హవా నడిచింది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ..  కొన్నాళ్లపాటు హవా నడిచింది అనే చెప్పాలి. కేవలం అందం అభినయం ఉన్న పాత్రలోనే కాదు గ్లామర్ పాత్రల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల అందరిని కట్టిపడేసింది  ఈ ముద్దుగుమ్మ  ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరం అయింది అని చెప్పాలి. అయితే తెలుగులో మాత్రమే కాదు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.


 దాదాపుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సినిమాల్లో కూడా నటించింది.   అయితే సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే 2018 లో రష్యాన్ బిజినెస్ మాన్ ఆండ్రు ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక ఆ తర్వాత సినిమాలకు కూడా దూరం అయింది  వీరిద్దరి పెళ్లి బంధానికి గుర్తుగా ఒక పాప కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో శ్రీయ ఎంతలా యాక్టివ్గా   ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెచ్చి పోయి మరి అందాలనూ ఆరబోత చేస్తూ తన భర్తతో ఎంతో రొమాంటిక్ మూడ్లో గడుపుతుంది  ఈ ముద్దుగుమ్మ.


 ఎక్కడ సిగ్గుపడకుండా భర్తతో రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే తన భర్తతో కలిసి ఒక స్టేజి మీద కూడా రెచ్చిపోయింది  శ్రియ. ఇటీవలే తన భర్తతో కలిసి జీ తెలుగు లో ప్రసారమయ్యే ఒక కార్యక్రమానికి వచ్చింది. ఈ క్రమంలోనే స్టేజ్ మీద తన భర్తతో తెలుగులో మాట్లాడించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు ఒకసారి చూపించండి అంటూ ప్రదీప్ అడిగాడు. దీంతో వారిద్దరూ కలిసి స్టిల్స్ ఇచ్చారు  ఈ క్రమంలోనే శ్రీయకు ఆండ్రూ బుగ్గ మీద ముద్దు పెట్టగా.. శ్రియ మాత్రం రెచ్చిపోయి లిప్ లాక్  పెట్టేసింది. దీంతో అక్కడున్న ప్రదీప్ తో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: