తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో దక్షణాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఛార్మి చిత్ర పరిశ్రమలోకి అనుకోకుండా అడుగు పెట్టింది. అయితే ముంబాయిలో కాకతాళీయంగా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి తెలుగు సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చాడు. కాగా.. అప్పటికి ఛార్మి వయస్సు 14సంవత్సరాలు కావడంతో కొన్ని షరతులపైనా సినిమాను ఒప్పుకున్నారంట. ఆలా ఆమె చిత్ర పరిశ్రమకి పరిచయమైయ్యారు. అయితే మొదటి సినిమా అనుకునంతగా గుర్తింపు తీసుకురాలేదు.

ఆ తరువాత ఆమె కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. తమిళ్ చిత్ర పరిశ్రమలో మంచిపేరు గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి  కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ సరసన  శ్రీ ఆంజనేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఆమె నటించిన సినిమాలు పరాజయం పొందినప్పటికీ తెలుగులో మంచి ఆదరణ పొందింది. అయితే పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలను అందుకుంది. అయితే వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది.

ఇక అప్పట్లో ఛార్మి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇండస్ట్రీకి దూరమైనా ఛార్మి ప్రస్తుతం సినీ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఆమె ప్రొడ్యూసర్ గా మారారు. పూరి దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకి ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. గతంలో ఛార్మి పెళ్లిపై అనేక వార్తలు వచ్చినప్పటికీ వాటిపైనా స్పందించారు. అయితే పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేద‌ని ఛార్మి చెప్పిన విష‌యం అందరికి తెలిసిన విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: