అంతెందుకు ఆయన సోదరుడు వెంకటేష్ తాజా చిత్రం నారప్ప థియేటర్ రిలీజ్ కు లేట్ అవుతుందనే ఆయన కు ఎన్ని థియేటర్లు ఉన్నా కూడా ఓ టీటీకే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు దృశ్యం 2 - విరాటపర్వం సినిమాల విడుదల విషయలో ఆయన ఏం తేల్చు కోలేక పోతున్నారట. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. జనాలకు మరీ కాక పోయినా ఓ మోస్తరుగా థియేటర్లకు వస్తున్నారు. ఈ రెండు సినిమా లపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా వరకు తగ్గించేశారు. ఈ టైంలో ఈ రెండు సినిమాలు థియేటర్లకు ఇస్తే లాభాలు వస్తాయా ? లేదా డిస్ట్రిబ్యూటర్ షేర్ , ఖర్చులు పోగా నిర్మాతకు మిగిలేది ఏం ఉండదా ? లేకపోతే డైరెక్ట్ ఓ టీటీకి వెళ్లిపోవాలా ? అని సురేష్ బాబు డైలమాలో ఉన్నారట.