డైరెక్టర్ అవ్వాలనే ఆకాంక్షతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కథానాయకులుగా మారిన కొందరి హీరోలలో సిద్దార్థ్ ఒకరు. "బాయ్స్" సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరో "బొమ్మరిల్లు" సినిమాతో ఓవర్ నైట్ హీరోగా క్రేజ్ పెంచేసుకున్నాడు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" వంటి చిత్రాలతో సక్సెస్ ను అందుకుని దూసుకుపోతున్న సమయంలో వరుస ఫ్లాపులతో తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత తమిళంలో సెటిల్ అయ్యి అక్కడ స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. అయితే కెరియర్ పరంగా సెటిల్ అయిన అమ్మాయిల కలల రాకుమారుడు సిద్దు మాత్రం లైఫ్ సింగల్ గానే ఎంజాయ్ చేస్తున్నారు.

తన క్లాస్ మెట్ మేఘనను ప్రేమించి 2003 లో పెళ్లి చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో 2007 లో విడాకులు తీసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక కొడుకు కూడా ఉన్నాడు.  ఇక అప్పటి నుండి సింగల్ గానే అంటున్నారు ఈ క్రేజీ హీరో. మేఘనతో సిద్దు విడాకులు తీసుకోవడానికి..ఇప్పటికీ ఒంటరిగానే ఉండటానికి కారణాలు ఇవే అంటూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. "రంగ్ దే బసంతి" మూవీ కోసం బాలీవుడ్ కు వెళ్లిన సిద్దార్థ్ ఆ సమయంలో హీరోయిన్ సోహాలి ఖాన్ తో సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారిందని వీరి వ్యవహారం కాస్త భార్య మేఘనకు తెలియడంతో విషయం విడాకుల వరకు వెళ్లిందని పలు కథనాలు వినిపించాయి.

ఆ తర్వాత సమంతతో కూడా చాలా కాలం ప్రేమ కొనసాగింది అని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని అయితే సమంత తనకి బ్రేక్ అప్ చెప్పడం సిద్ధార్ద్ తీవ్ర మనస్థాపానికి చెందాడని దానివల్ల తన కెరియర్ కూడా గాడి తప్పిందని ఇలా సామ్, సిద్ధుల గురించి చాలా వార్తలే వినిపించాయి. ఒకానొక సమయంలో శృతి హాసన్ తో సహజీవనం చేస్తున్నాడని కూడా వార్తలు గట్టిగానే వినిపించాయి. వీటిలో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ సిద్దార్ధ్ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: