మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన రామ్ చరణ్.. తాజాగా తన కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితమే శంకర్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మొదటి షెడ్యూల్ ని పూణేలో ప్లాన్ చేశాడు దర్శకుడు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటోంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ అందరిని నీ షాక్ కి గురిచేస్తోంది. అదేంటంటే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాస్ట్లీ సాంగ్ గా దర్శకుడు శంకర్ ఈ పాటను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శంకర్ సినిమాలో పాటలు ఎంత గ్రాండియర్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పాటలను చాలా లావిష్ గా చిత్రీకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పాటల కోసమే కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటారు శంకర్. ఇక ఇప్పుడు కూడా రామ్ చరణ్, కియారా అద్వాని లపై ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఓ డ్యూయెట్ సాంగ్ ని ప్లాన్ చేశాడట. ఇక ఈ ఒక్క పాటని దాదాపు 12 రోజులు షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా ఈ పాటని చిత్రీకరిస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు అని నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ శంకర్ కి ఎక్కడ కూడా షరతులు పెట్టలేదు దిల్ రాజు. డైరెక్టర్ అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా ఒక విజువల్ ఫిస్టులా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. సీనియర్ నటుడు శ్రీకాంత్, సునీల్, మలయాళ నటుడు జయరామ్ తదితరులు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: