ఇప్పుడు టాలీవుడ్ ఇన్స‌ర్ స‌ర్కిల్స్ లో ఇదే మాట వినిపిస్తోంది. స‌హ‌జంగానే ఏ సినిమా షూటింగ్ లో అయినా హీరో, హీరోయిన్ల మ‌ధ్య చిన్న చిన్న గ్యాప్‌లు వ‌చ్చాయ‌న్న మాట‌లు మ‌నం వింటూనే ఉంటాం. అంతెందుకు ఎంసీఏ సినిమా షూటింగ్ లో హీరో నాని కి , హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కి మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో వారు ఒక‌రి నొక‌రు మాట్లాడుకు నేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న ప్ర‌చారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. చివ‌ర‌కు నిర్మాత దిల్ రాజుతో పాటు కొంద‌రు రంగం లోకి వారి స‌మ‌స్య ప‌రిష్క రించ‌డంతో తిరిగి షూటింగ్ జ‌రిగింది.

అయితే ఇప్పుడు రాధే శ్యామ్ షూటింగ్ టైంలో కూడా చివ‌రి రెండు నెల‌లు అస‌లు ప్ర‌భాస్ , హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడు కోలేదు స‌రిక‌దా ? క‌నీసం వీరు ఒక‌రి నొక‌రు ఎదురు ప‌డేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదంటున్నారు. అస‌లు మొహాలు చూసుకు నేందుకు కూడా వీరు ఇష్ట ప‌డ‌లేద‌ట‌. చివ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చే సీన్లు షూట్ చేయ‌డానికి కూడా వీరి మ‌ధ్య స‌ఖ్య‌త లేక ఇద్ద‌రి మీద వేర్వే రుగా గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసి .. మ‌ళ్లీ వీటిని ఫిక్స్ చేసుకున్నార‌ని వినికిడి.

అయితే గ‌తంలోనే ఈ ప్ర‌చారం బ‌య‌ట‌కు పొక్కినా యూవీ సంస్థ ఇవ‌న్నీ అబద్ధాలే అని కొట్టి ప‌డేసింది. అయితే ఇప్పుడు పూజ హీరో ప్ర‌భాస్ , తాను అస్స‌లు మాట్లాడు కోలేద‌న్న విష‌యం బ‌య‌ట పెట్ట‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక్ అయ్యింద‌ని అంటున్నారు. అస‌లు రీజ‌న్ ఏంట‌న్న‌ది బ‌య‌ట‌కు రాక‌పోయినా ఇందుకు కార‌ణం మాత్రం పూజే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్ ?  

పూజ చెప్పా పెట్ట‌కుండా షూటింగ్ ల‌కు వ‌రుస‌గా డుమ్మా కొట్ట‌డం తో ప్ర‌భాస్ రెండు మూడు సార్లు చిరాకు ప‌డ్డాడ‌ట‌. ఆమె వైఖ‌రికి చివ‌ర‌కు విసిగి పోయి ఆమె తో క‌లిసి షూటింగ్‌లో పాల్గొనేందుకు కూడా మ‌నోడు ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: