టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవల గోవాలో ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇక గోవా షెడ్యూల్ అనంతరం ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజాగా అక్కడే విజయ్ దేవరకొండ పై ఓ మాస్ సాంగ్ నీ షూట్ చేస్తోందట చిత్ర యూనిట్. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు. 


విజయ్ మాస్ గెటప్ లో ఉన్న ఓ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో చార్మి షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తెలిపింది.ఇక సినిమాకే ఈ మాస్ సాంగ్ హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగుతో పాటు మిగతా ప్రధాన భాషలు అన్నింటిలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్, చార్మి లతో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ సినీయర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనుండగా..

ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ మొదటిసారి ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇక మేకర్స్ ఈ సినిమాను సుమారు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అటు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: