ఒకప్పుడు తెలుగు
సినిమా ప్రపంచం అంతా దేవిశ్రీ సంగీతం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేది. ఆయన
సినిమా వస్తుంది అంటే చాలు తప్పకుండా ప్రేక్షకు లు అందరూ మెచ్చే మంచి సంగీతాన్ని ఇస్తాడు అందరూ
ఆడి పాడే చాలా మంచి పాటలను ఇస్తాడు అని అనుకునేవారు కానీ ఇటీవల కాలంలో
దేవిశ్రీప్రసాద్ తన పాటలతో ప్రేక్షకులను ఏమాత్రం మేప్పించ లేకపోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దేవిశ్రీకి అసలు ఏమైంది అనేలా ఆయన కెరియర్ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయింది.
పెద్ద హీరోల
సినిమా లకే సంగీతం ఇస్తున్నా
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ఆయనను డౌన్ అయ్యేలా చేసింది అని చెప్పవచ్చు. మరో వైపు నెంబర్ వన్ స్థానంలో
తమన్ దూసుకు పోతూ ఉండగా దేవి
శ్రీ ప్రసాద్ ఈ విధంగా చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ప్రస్తుతం ఆయన
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ
సినిమా నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. అవి ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్న కూడా అయితే కొత్తదనం ఏమీ లేదు అంటున్నారు.
తాజాగా ఈ
సినిమా నుంచి మూడో పాట విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ పాట ప్రేక్షకులను మెప్పించడం అనే విషయం పక్కన పెడితే దీనిలో పాత వాసనలు చాలా కనిపిస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాటకు ఈ పాటకు పోలికలు కనిపిస్తున్నాయి. దాంతో
దేవిశ్రీప్రసాద్ ఎందుకు కొత్త దానం చూపించలేక పోతున్నాడు అని అంటున్నారు. ఒకవేళ ఇదే కొనసాగితే
దేవిశ్రీప్రసాద్ తొందరలోనే కనుమరుగై పోవడం ఖాయమని కూడా అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఇప్పటికైనా దేవి
శ్రీ అభిమానుల విన్నపాన్ని స్వీకరిస్తాడా అనేది చూడాలి.