టాలీవుడ్
సినిమా పరిశ్రమలో సంగీతానికి రెండు కళ్ళ లాంటి వారు
దేవిశ్రీ ప్రసాద్ మరియు తమన్. ఈ ఇద్దరు
సంగీత దిగ్గజాల ఎవరి ప్రతిభ వారికి ఉంది. ఎవరి క్రేజ్ వారిది. ఎవరి ప్రేక్షకులు వారికే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో
దేవిశ్రీప్రసాద్ కంటే ఎక్కువగా
తమన్ హవా నడుస్తుంది అని చెప్పాలి. గత రెండు మూడు సంవత్సరాలుగా తన సంగీతంలో మంచి వెరైటీ చూపించడంతో పాటు నేపథ్య సంగీతంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
ఇదే సమయంలో
దేవిశ్రీప్రసాద్ కొంచెం వెనక పడడంతో నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోయాడు తమన్. తమ గత రెండు దశాబ్దాలుగా
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తో ప్రేక్షకులను అలరిస్తూ రాగా ఇప్పుడు
యువ సంచలన
తమన్ తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కొత్త నీరు రాక మంచిదే అయినా పాతవారు ప్రేక్షకులను అలరించడంలో ఏమాత్రం తగ్గకూడదు కాబట్టి దేవి
శ్రీ ప్రసాద్ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈ ఇద్దరు
సంగీత దర్శకులు నుంచి వచ్చిన సినిమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న
తమన్ రేంజ్ లో
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను మెప్పించకపోవడం ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.
తమన్ అల వైకుంఠపురం లో
సినిమా కి సంగీతం అందించగా అది ఆల్బమ్ హిట్ గా మారింది. ఇప్పుడు అదే
హీరో కి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప సినిమాకు సంగీతం అందిస్తున్న
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్
డైరెక్టర్ గా తన రేంజ్.మ్యూజిక్ ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
దేవిశ్రీప్రసాద్ మార్చుకుంటే మరిన్ని సినిమాలు చేయవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇక
తమన్ చేతిలో ప్రస్తుతం దాదాపు పెద్ద సినిమాలే ఉన్నాయి.
తమన్ కూడా చిన్న సినిమాలను ఒప్పుకోవడం లేదు.