తెలుగు బుల్లితెర బిగ్ బాస్ ఐదవ సీజన్ 8 వ వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ 8వ వారం కెప్టెన్సీ కోసం ఏకంగా ఆరుగురు సభ్యులు పోటీ పడ్డారు. వారిలో షణ్ముఖ్, శ్రీ రామచంద్ర, అని మాస్టర్, సన్నీ ఇంకా మానస్ ఉన్నారు. అభయహస్తం అనే టాస్క్ లో పలురకాల చాలెంజెస్ గెలిచిన కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏమిటి అంటే.. బస్తాలో ఉన్న ధర్మకోల్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ టాస్క్ లో ఒకరి బస్తాని మరొకరు ఖాళీ చేయవచ్చు. చివరికి ఎవరి బస్తాలో ధర్మకోల్ ఎక్కువగా ఉంటాయో వాళ్లే విజేత గా మారి కెప్టెన్ గా నిలుస్తారు. ఇక ఈ టాస్క్ లో షణ్ముఖ్ జస్వంత్ గెలిచినట్లుగా తెలుస్తోంది.

 ఇక టాస్క్ లో సన్నీ, శ్రీ రామ్ కి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది  శ్రీరామ్..' నువ్వు ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడుతున్నావ్ అని అనుకున్నాను కానీ నువ్వు కూడా గ్రూప్ గానే గేమ్ ఆడుతున్నావ్' అని అన్నాడు. సరిగ్గా ఇక్కడే సన్నీకి కోపం వచ్చింది. ఇక ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. ఇక ప్రోమోలో దీన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు. ఇక ఈ టాస్క్ లో మిగతా వాళ్లందరినీ ఓవర్టేక్ చేస్తూ తన బస్తా లో ఎక్కువ ధర్మకోల్ ఉండేలా చూసుకుంటూ.. షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ మొదలై 8 వారాలు అవుతున్నా.. షణ్ముక్ ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు. లాస్ట్ టైం టాస్క్ సరిగ్గా ఆడిన కూడా, సిరి, జెసి ల వల్ల తన ఎగ్స్ ని జీరో చేసుకోవాల్సి వచ్చింది.

 అయితే ఇప్పుడు మాత్రం ఇండివిడ్యువల్ టాస్క్ కాబట్టే అభయహస్తం టాస్క్ లో భాగంగా ఇచ్చిన ఛాలెంజర్స్ లో విన్ అయి.. కెప్టెన్సీ టాస్క్ లో కూడా గెలిచి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక షణ్ముక్ కెప్టెన్ అయ్యాక రేషన్ మేనేజర్ గా అని మాస్టర్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆనీ మాస్టర్ కి కిచెన్ గురించి బాగా తెలుసని అంతకుముందు ఎపిసోడ్లో సిరి తో డిస్కస్ చేసాడు షణ్ముక్. నిజానికి షణ్ముఖ్ కెప్టెన్ అయ్యాక సిరి లేదా జెస్సి లలో ఒకరిని రేషన్ మేనేజర్ చేస్తారని అనుకున్నారు హౌస్ మేట్స్. కానీ షణ్ముఖ్ మాత్రం ఆ ఇద్దరికీ కాకుండా ఆనీ మాస్టర్ ని రేషన్ మేనేజర్ గా ఎంపిక చేశాడు.ఇక హౌస్ కి కొత్త కెప్టెన్గా షణ్ముక్ ఎంపిక కావడంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: