తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు తన హవా నడిచింది ఇంద్రజ. టాలీవుడ్ ఇండస్ట్రీలో పిల్లి కళ్ళ సుందరిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఇకఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అందరికీ దగ్గర అయ్యి.. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించి తన సత్తాచాటింది ఇంద్రజ. అయితే అప్పట్లో హీరోయిన్గా తన నటనతోనే కాదు డాన్సులతో కూడా అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమైన సీనియర్ హీరోయిన్ కేవలం అడపాదడపా పాత్రలు మాత్రమే చేసుకుంటూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.


 కానీ ఇటీవలే జబర్దస్త్ అనే కార్యక్రమంలో జడ్జిగా అవతారమెత్తింది ఇంద్రజ. ఇక ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయింది. తన నిష్కల్మషమైన నవ్వుతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఇక ఇలా జబర్దస్త్ జడ్జ్ గా ఇంద్రజ ఉన్నన్ని రోజులు ఇంద్రజ నే పూర్తిస్థాయి జడ్జిగా కొనసాగించాలన్న డిమాండ్ లు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత రోజా రావడంతో ఇక ఇంద్రజ వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో జడ్జ్ అవతారమెత్తింది ఈ సీనియర్ హీరోయిన్. ఇకపోతే ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ వస్తోంది.  అప్పుడప్పుడు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లో కూడా ఆకట్టుకుంటుంది.


 ఇకపోతే ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వాహకులు తగ్గేదేలే అంటూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన్నారా చోప్రా, రోజాసెల్వమని, ప్రియమణి, ఇంద్రజ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయారు. అయితే ఇక ఈ కార్యక్రమంలో జడ్జీలుగా వచ్చిన ఈ నలుగురు కూడా అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇందులో భాగంగానే సీనియర్ హీరోయిన్ ఇంద్రజ సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. కన్నులతో చూసేటి ఓ మగువా అనే పాట పై ఏకంగా కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది హీరోయిన్ ఇంద్రజ. అంతేకాదు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇక ఈ సీనియర్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ చూసి మైమర్చిపోతున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv