టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో వాకాడ అప్పారావు కూడా ఒకరు. యువ, అగ్ర హీరోలతో పలు సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాకాడ అప్పారావు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్ కు తనకు మధ్య సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో గ్యాప్ వచ్చి తాను బయటకు వచ్చానని.. అంతేగాని చరణ్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని, గతంలో జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలియజేశాడు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ..' చిరంజీవి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదని, ఆయన మనిషిని చూసి పేగులు లెక్క పెడతాడని..అంతే కాకుండా ఆయనకు సినిమా అంటే ఫింగర్ టిప్స్ అని వాకాడ అప్పారావు పేర్కొన్నారు. ఇక కెమెరామెన్ షాట్ తప్పుగా పెడుతున్నాడు అంటే చిరంజీవి పక్కకు వెళ్లి మాట్లాడతారని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి, చరణ్ ఇద్దరు కూడా ఎక్స్ట్రార్డినరీ పీపుల్ అని వెల్లడించారు వాకాడ అప్పారావు. ఇక ఆచార్య సినిమా కోసం తాను ఒక వారం రోజులపాటు పనిచేశానని, చిరంజీవి ,చరణ్ కి తనంటే విపరీతమైన గౌరవం అని పేర్కొన్నారు.

అంతే కాదు చిరంజీవి తనకు సుమారు 38 సంవత్సరాల నుంచి పరిచయమని వాకాడ అప్పారావు చెప్పారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ చాలా సౌమ్యులని మనుషులను చూసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఈ విషయాన్ని గుర్తిస్తారని వాకాడ అప్పారావు తెలిపారు. ఇక నిర్మాణ రంగం గురించి మాట్లాడుతూ నిర్మాత బాగుంటేనే కుటుంబాలు బ్రతుకు తాయని..  ఎక్కడ ఖర్చు పెట్టాలా అక్కడే ఖర్చు చేయాలి.. ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అక్కడ ఖర్చు పెట్టకూడదని వాకాడ అప్పారావు పేర్కొన్నారు. ఇక తను పనిచేసే సినిమాల విషయంలో అన్నీ కూడా తనకు తెలిసే జరుగుతాయని అన్నారు వాకాడ అప్పారావు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: