అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా కు సుకుమార్ దర్శకత్వం వహించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. ఆ విధంగా సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తుండగా  మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో విడుదల చేస్తుండటం విశేషం.

ఇప్పటికే ఈ సినిమా యొక్క టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉండగా యూట్యూబ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటిగా ఇప్పుడు యూట్యూబ్ లో విడుదల అవుతున్నాయి. అవి కూడా ప్రేక్షకులను భారీగా అలరిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన సామి సామి అనే పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 24 గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ అందుకొని రికార్డు సృష్టించిన ఈ సినిమా భవిష్యత్తులో కూడా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని చెబుతున్నారు.

ఏదేమైనా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అంతేకాదు అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ లో నటిస్తు ఉండగా  రష్మిక కూడా అదే రేంజ్ లో నటిస్తుంది. లారీ డ్రైవర్ గా అల్లు అరవింద్ కనిపించబోతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో సునీల్ మరియు ఫాహాద్ పజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఏదేమైనా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న సినిమాకు భారీ డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

ఈ చిత్ర ప్రమోషన్ పనులను ఇప్పటికే మొదలు పెట్టింది. బన్నీ ఆడియో ఫంక్షన్ కి వెళుతూ అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అక్కడి నుంచే మొదలు పెట్టాడు. మరి సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠ పురం సినిమా తర్వాత కలసి చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: