నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా అఖండ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొత్తం పూర్తి కాగా మూవీ ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయగా థమన్ సంగీతం అందించారు.
అయితే దీని తరువాత ఇటీవల రవితేజ తో క్రాక్ మూవీ తీసి సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని తో బాలయ్య ఒక భారీ సినిమా చేయనున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం .ఇటీవల అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ గా కనిపించనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ ని ఎంతో పవర్ఫుల్ గా సిద్దంచేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇందులో బాలయ్య కి జోడిగా యువ భామ శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆల్మోస్ట్ ఇందులో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపికైందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో మరొక హీరోయిన్ గా ఉప్పెన భామ కృతి శెట్టి నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. తొలిసారిగా బాలయ్య తో ఛాన్స్ రావడంతో పాటు సినిమా స్టోరీ కూడా ఎంతో నచ్చడంతో కృతి చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే కృతి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: