టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సంస్థలు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ వారు ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు రోజుల క్రితం స్పెయిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా త్వరలో తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కి అందరి నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కొద్దిరోజుల నుండి ఈ సినిమా యొక్క సాంగ్స్ విషయమై మహేష్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపుతూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సందడి చేస్తున్నారు థమన్. నిన్న ముంబై లో ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం అయినట్లు థమన్ పోస్ట్ పెట్టారు. పాటలు అదిరిపోనున్నాయని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇవి ఎంతో నచ్చుతాయి అని అంటున్నారు థమన్. ఇక కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్న న్యూస్ ని బట్టి ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ని దీపావళి రోజున రిలీజ్ చేస్తారని అందరూ భావించారు.

అయితే నేడు ఉదయం నుండి పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని ఇప్పట్లో రిలీజ్ చేయరని అంటున్నారు. దానికి కారణం, మొదట సర్కారు వారి పాట ని జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన యూనిట్, ఇటీవల ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదల తేదీని ప్రకటించడంతో తమ సినిమాని వాయిదా వేయాలని సర్కారు వారి పాట బృందం ఆలోచన చేస్తోందని, అందుకే సాంగ్స్ కూడా క్రిస్మస్ తరువాతనే రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బాడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: