దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి బెట్టుకోవాలి అన్న సామెతను
హీరోయిన్ లు అక్షరాలా పాటిస్తున్నారు. తమకు క్రేజ్ ఉన్నప్పుడే పాపులారిటీ ఉన్నప్పుడే డిమాండ్ ఉన్నప్పుడే
మార్కెట్ ఉన్నప్పుడే వారు డబ్బు సంపాదించుకోవాలని రెమ్యునరేషన్ అధికంగా డిమాండ్ చేస్తున్నారు. టాప్
హీరోయిన్స్ గా ఉన్న
హీరోయిన్ లు అందరూ కూడా హీరోల ను మించి పారితోషకం అందుకుంటూ కనిపిస్తున్నారు. అలా ప్రస్తుతం
టాలీవుడ్ లో టాప్
హీరోయిన్ గా ఉన్న వారు
పూజా హెగ్డే రష్మిక మందన
రాశీ ఖన్నా సాయి పల్లవి ఇంకా కొంతమంది టాప్ హీరోయిన్లుగా ఉన్నారు. వారి రెమ్యునరేషన్ రెండు కోట్లకు పై మాటే అంటే ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వరుసగా అగ్ర హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న పూజాహెగ్డే ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. పెద్ద సినిమాల్లో కూడా ఆమె నటిస్తూ ఉండటంతో ఆమెకు ఈ రకమైన భారీ డిమాండ్ ఏర్పడింది అని అంటున్నారు. ఆమెకు
బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడం కరెక్టే అని అంటున్నారు. ఆమె తర్వాత
టాలీవుడ్ లో అందరి వద్ద మంచి మార్కులు కొట్టేసి పెద్ద హీరోల సినిమాలలో నటిస్తున్న
హీరోయిన్ రష్మిక మందన్న.
ఈమె చిన్న సినిమాలతోనే
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు స్టార్
హీరోయిన్ గా ఎదిగిన పెద్ద హీరోల సినిమాలు చేస్తుంది.ఈమె కూడా రెండు కోట్లకు పైగానే చేస్తుందట.
బాలీవుడ్ లో కూడా ఆమె పాపులారిటీ తెచ్చుకునే విధంగా అక్కడ కొన్ని సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అది విడుదలయ్యాక తన పారితోషకాన్ని ఎంత పెంచుతుందో మరి. ఆ తర్వాత
సాయి పల్లవి రాశి
కన్నా వంటి వారు కోటిన్నరకు పైగా డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని హీరోయిన్లు హీరోలకు సమానంగా అందుకుంటూ నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.