ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలో ల‌క్ష‌ల సంఖ్య లో అభిమానులు ఉంటారు. ఆయ‌న సినిమా లు హిట్ కావ‌డానికి ఆయ‌న అభిమానులు చాలా కృషి చేస్తారు. అయితే టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ పూరి జగ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం లో ప‌వ‌న్ కళ్యాణ్, త‌మ‌న్నా హీరో హీరోయిన్ లు గా వచ్చిన సినిమా కెమెరామెన్ గంగ తో రాంబాబు అనే సినిమా ను తెలంగాణ లో ఉన్న ఆయ‌న అభిమానుల్లో కొంత మంది తో పాటు తెలంగాణ ప్ర‌జ‌లు కూడా ఈ సినిమా పై వ్య‌తిరేక గ‌ళం వినిపించారు. అంతే కాకుండా ఆ చిత్ర యూనిట్ నుంచి కూడా క్ష‌మాప‌ణలు కూడా చెప్పించు కున్నారు.



ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో గా వ‌చ్చిన కెమెరామెన్ కంగ తో రాంబాబు సినిమా ఇంతలా వివాదం కావ‌డానికి కార‌ణం.. ఈ సినిమా లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్య‌మాన్ని కించ ప‌రిచేలా కొన్ని సీన్లు ఉన్నాయి. అలాగే కొన్ని పార్టీ ల‌ను ఉద్ధేశిస్తు కూడా కొన్ని డైలాగ్ లు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కు వ్య‌తిరేకింగా ఆందోళ‌న‌లు పెరిగి పోయాయి. అంతే కాకుండ సినిమా లో ఈ సీన్ల ను తొల‌గించి తెలంగాణ  ఉద్య‌మ‌కారులకు క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని ఆందోళ‌న‌లు చేశారు. చివ‌రికి ఈ సినిమా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మీడియా ముందుకు వ‌చ్చి తెలంగాణ ఉద్య‌మ కారుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అలాగే అభ్యంత‌రం గా ఉన్న సీన్ల ను కూడా సినిమా లో నుంచి క‌ట్ చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఈ వివాదానికి తెర ప‌డింది. ఈ వివాదం తో కెమెరామెన్ గంతో సినిమా లో చాలా సీన్ల ను క‌ట్ చేశారు. దీంతో సినిమా పూర్తి గా మారిపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ పేరు తెచ్చుకున్నా  కలెక్ష‌న్ లు మాత్రం బాగానే తెచ్చుకుంది. ఈ సినిమా అప్ప‌ట్లో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద 52 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది.  




మరింత సమాచారం తెలుసుకోండి: