స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,రష్మీక మందన్న జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగకు ఫుష్ప టీమ్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందట.

ఇక ఇప్పటికే సినిమా నుండి మూడు పాటలు విడుదల చేసారు ఈ సినిమా మేకర్స్. ఆ సాంగ్స్ కి  రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. దాక్కో దాక్కో మేక,శ్రీ వల్లి,సామి సామి అనే మూడు పాటలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాయి.ఇక దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.ఇంతకు ముందు కూడా డిఎస్పీ,అల్లు అర్జున్, సుకుమార్ లు కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి అవే ఆర్య, ఆర్య 2.ఆ రెండు సినిమాల్లో కూడా సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయం ఏమిటంటే ఫుష్ప రాజ్ అభిమానులకు దీపావళి ట్రీట్ ఇవ్వబోతున్నారట.

నవంబర్ 4న దీపావళి పండుగ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని అల్లు అర్జున్, ఫుష్ప మేకర్స్ అనుకుంటున్నారూ అని తెలుస్తోంది.దీని గురించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.నవంబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం విలన్ గా కనిపించబోతున్నాడు. సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం బన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: