ఇండస్ట్రీలో సాధారణంగా సినిమాలు చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్ మధ్య ల డైరెక్టర్ ల మధ్య ల నిర్మాతల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో ఆ గొడవలు చిన్న గా ఉండొచ్చు పెద్దగా కూడా అనిపించొచ్చు లేదా ఒక చిన్న మాటతో వదిలేయవచ్చు. ఇండస్ట్రీలో ఇక కొందరి మధ్య గొడవ అయినా తరువాత ఆ ఇద్దరి మధ్యల మరొక సినిమా చేసే ఆలోచన కూడా ఉండకపోవచ్చు. అలా సుకుమార్కి జూనియర్ ఎన్టీఆర్ ఒక సారి వార్నింగ్ ఇచ్చారట.అసలు వాటిని ఇవ్వాల్సినంత తప్పు సుకుమార్ ఏం చేశాడు అనే విషయానికి వస్తే..2016లో సుకుమార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో.

ఇక ఈ సినిమా అప్పుడే వీరిద్దరి మధ్య ఒక వివాదం జరిగిందట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వేరే సినిమా వదులుకున్నాడు కానీ సుకుమార్ మాత్రం ఈ సినిమా షూటింగ్ తో పాటు మరో సినిమాని కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని అందుకే ఎన్టీఆర్ కాస్త బ్రేక్ ఇద్దామని అనుకున్నాడట. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా తీస్తేనే నేను చేస్తాను లేకపోతే నేను చెయ్యను అని సుకుమార్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక సుకుమార్ చేసేది ఏమీ లేక ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో సినిమా పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పార్ట్ వన్ పుష్ప : ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదల కానుంది.ఇక ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ పూర్తి చేసుకొని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: