అయితే "ఆహా''లో టాక్ షోకు బాలకృష్ణను ఎంపిక చేసిన విషయాన్ని అల్లు అరవింద్ వెల్లడిస్తూనే... అసలు ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పారు. టాక్ షో విషయంగా చర్చ జరిగినప్పుడు.. ఆ షో టీమ్ సభ్యులు పలువురి పేర్లు చెప్పారు. అయితే తాను బాలకృష్ణ అయితే టాక్ షోకు సరిగ్గా సరిపోతారని చెప్పినట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఈ విషయంగా బాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పగా.. ఆయన అన్ స్టాపబుల్ కాన్సెప్ట్ గురించి విని ఓకే చెప్పారని అరవింద్ తెలిపారు. బాలయ్య టపాసులాంటివాడని, ఆయన అంత సులువుగా అన్ స్టాపబుల్ షోకు ఓకే చెబుతారని అనుకోలేదని "ఆహా' ఓటీటీ ఈవెంట్లో అల్లు అరవింద్ అన్నారు.
నిజానికి స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్లో ఎంత ఇమేజ్ ఉందో.. రాజకీయాల్లోనూ ఆయనకే అంతే ఇమేజ్ ఉంది. అంతేకాకుండా బాలకృష్ణ మాటలను అందరూ ఆసక్తిగా వింటారు. ఆయన చెప్పే డైలాగులను ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ బాగా గుర్తించినట్లుగా ఉంది. అందుకే ఆయన ఆహాలో నిర్వహిస్తున్న టాక్ షోకు బాలకృష్ణ అయితే బాగుంటుందని ఆలోచన చేసినట్లుగా ఉందని టాలీవుడ్ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.
ఇక తెలుగు సినీ పరిశ్రమలోని పలు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన గీతా ఆర్ట్స్ సంస్థ రూపొందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా.. విజయాల శాతం మాత్రం ఎక్కువగానే ఉంది. ఇందులో అల్లు అరవింద్ పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే- ఆయన ఎంపిక చేసే కథలు అలా ఉంటాయి. గీతా ఆర్ట్స్ తరపున ఒక సినిమా వస్తుందంటే..అది డెఫినెట్గా హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్ను అభిమానులకు కలిగించాడు అల్లు అరవింద్. అలాంటి ఆయన.. "ఆహా''లో టాక్ షోకు బాలకృష్ణను ఎంపిక చేశారంటే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అందుకే అల్లు అరవింద్ బాలయ్యకు జై కట్టారని చర్చ జరుగుతోంది.