అయితే ఇప్పుడు "ఆహా" ఓటీటీలో టాక్ షోకు అనుహ్యంగా బాలయ్య పేరు ఖరారు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో "ఆహా" ఓటీటీలో "అన్స్టాపబుల్ టాక్ విత్ ఎన్బీకే" ప్రోగ్రామ్ ద్వారా బాలయ్య తీసుకునే పారితోషికం భారీగానే ఉంటుందని పుకార్లు షికార్లు చేశాయి. సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు బాలయ్య టాక్ షోకు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో కూడా బాలయ్య అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన మంచి మనసును చాటుకున్నారు. "ఆహా" టాక్ షో ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని చారిటీకి ఉపయోగించాలని బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారట. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సహా వివిధ సేవా కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని ఉపయోగించేలా ప్రణాళిక రచించారట.
నిజానికి బాలయ్యతో ప్రమోట్ చేయనున్న "ఆహా" టాక్ షో మొదటి సీజన్కు గాను ఆయనకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకుపైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తాన్ని ఛారిటీకి డొనేషన్గా ఇవ్వడమంటే మామూలు సంగతి కాదు. ఈ వితరణ ద్వారా బాలయ్య ఉదార స్వభావం కలవాడని, భోళా శంకరుడు అని మరోసారి రుజువు అయిందని ఆయన అభిమానులు అంటున్నారు. బాలయ్య మంచితనాన్ని వివరించడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని కూడా వారు అంటున్నారు. మొత్తంమీద "ఆహా" టాక్ షో రెమ్యునరేషన్ను బాలయ్య తీసుకోకుండా.. ఆ మొత్తాన్ని ఛారిటీకి ఇవ్వాలని అన్నారట. అందుకే బాలయ్య "ఆహా" టాక్ షోకు పారితోషికం వద్దన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.