టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి తొలిసారిగా అనగనగా ఓ ధీరుడు మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్, ఆ తరువాత ఓ మై ఫ్రెండ్ సినిమాలో యాక్ట్ చేసింది. అయితే అనంతరం ఆమెకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో హీరోయిన్ గా ఛాన్స్ రావడం ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడం జరిగింది. హరీష్ శంకర్ తీసిన ఆ సినిమా సూపర్ సక్సెస్ హీరోయిన్ గా టాలీవుడ్ లో శృతి కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.

అక్కడి నుండి తెలుగులో వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన శృతి ఆపైన ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సరసన నటించింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో ఆమె నటించిన శ్రీమంతుడు సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. ఇక ఇటీవల విజయ్ సేతుపతి తో లాభం సినిమాలో యాక్ట్ చేసి మరొక విజయం సొంతం చేసుకున్న శృతి, తన కెరీర్ లో తొలిసారిగా అతి త్వరలో బాలయ్య సరసన ఒక సినిమాలో నటించనుంది. త్వరలో బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని తీయనున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం కేవలం బాలయ్య సరసన మాత్రమే కాదు మరొక రెండు రోజుల్లో అఫీషియల్ గా ప్రారంభం కానున్న మెగాస్టార్ 154 మూవీలో చిరంజీవి కి జోడీగా శృతి ఎంపికైందని అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్సినిమా చేయనున్నారు. మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నిజంగా శృతి హీరోయిన్ గా ఎంపికైందో లేదో తెలియాలి అంటే అఫీషియల్ గా న్యూస్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. అదే కనుక నిజం అయితే అటు బాలయ్య తో ఇటు చిరు తో నటించే గొప్ప ఛాన్స్ శృతి అందుకున్నట్లే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: