ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ ల హవా ఎక్కువగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు క్రీడా ప్రముఖులకు సంబంధించిన జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకులకు తెలియని సరి కొత్త విషయాలను తెలియ చేసేందుకు దర్శకనిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు బయోపిక్ల కోసం కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం.. జీవిత చరిత్ర లోనే కొన్ని మార్పులు చేస్తే సరిపోతు ఉండడం కూడా దర్శక నిర్మాతలు బయోపిక్ పై ఎక్కువగా ఆసక్తి చూపడానికి కారణం అని చెప్పాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో అటు ప్రేక్షకులు అందరూ కూడా బయోపిక్ లను తెగ ఆదరిస్తున్నారు.

 కాగా ఇప్పటివరకు సినీ రంగ ప్రముఖులు రాజకీయ క్రీడా రంగాల ప్రముఖులు కు సంబంధించిన బయోపిక్లో తెరకెక్కించడం చూశాము. కానీ ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా ఒక గజదొంగ జీవితానికి సంబంధించిన బయోపిక్ తెరకెక్కుతుంది. అయితే ఇప్పటి వరకూ ఒక హీరో ఒక బయోపిక్ లో నటించడం  చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఇద్దరు హీరోలు ఒకే వ్యక్తి బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇది కాస్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ గా కొనసాగుతున్న రవితేజ, యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తీస్తున్న సినిమాలు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్టువర్ట్ పురానికి   చెందిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్  ఇద్దరు హీరోలు ఒకే సమయంలో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ టైగర్ నాగేశ్వరరావు పేరుతో సినిమా తీస్తూ ఉండగా.. ఇక సాయి శ్రీనివాస్ స్టువర్టుపురం దొంగ పేరుతో సినిమా తీస్తున్నారు. వీరిద్దరు తెరకెక్కించేది ఒకే వ్యక్తి బయోపిక్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఇదే తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: