జబర్దస్త్ లో జడ్జిగా, అలనాటి హీరోయిన్ గా, ఒక ఎమ్మెల్యేగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుందో నటి రోజా. ఇక ఈమె కష్టాల్లో ఎవరైనా ఉన్నారు అంటే చాలు పలు సందర్భాలలో ఈమె తన వంతు సహాయంగా ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఒక గొప్ప శుభవార్త విన్నానంటూ తెలియజేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


గత సంవత్సరం నటి రోజా ఎవరైయినా ఆడ పిల్లల ను చదివించాలని ఉద్దేశ్యంతో ఒక పేదింటి విద్యార్థిని దత్తత తీసుకొని చదివిస్తోంది. ఆమె పేరు పుష్ప కుమారి. ఆమె మెడిసిన్ చదవాలని నటి రోజా దగ్గరకు వచ్చి అడగగా.. తన చదువుకు అయ్యే ఎటువంటి ఖర్చుని అయినా  భరిస్తాం అని చెప్పి మాట ఇచ్చిందట. గత సంవత్సరమే ఆమెకు సంబంధించిన వారితో మాట్లాడి ఆమెను దత్తత తీసుకొని కాలేజీలో చేర్చిందట. అయితే బాలిక మాత్రం రోజా నమ్మకాన్ని ఒమ్ము  చేయలేదు.

పుష్ప ఎంతో కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 89 % మార్కులతో ఉత్తీర్ణురాలైయింది. రోజాఅమ్మాయి ఎత్తుకొని ఫోటోలు దిగి ఆ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో రోజా పుట్టినరోజు కావున తన పుట్టిన రోజు కానుకగా తనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది రోజా.


నటి రోజా పుష్ప తో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. నగరి ప్రజలతోపాటు, రోజా అభిమానులు, నెటిజన్లు కూడా ఇలాంటి గొప్ప పనులు మీరు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి దయాగుణం కేవలం కొంతమంది లో మాత్రమే ఉంటుందని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. రోజా నమ్మి తనని చదివిస్తున్న అందుకు పుష్ప కుమారి ని కూడా నెటిజన్లు బాగా అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: