ఇన్నాళ్లూ ఫస్ట్ ఆప్షన్‌గా కనిపించిన నయనతార ఇప్పుడు తెలుగు సినిమాలు తగ్గించింది. రెగ్యులర్ కమర్షియల్‌ మూవీస్‌ చేయడం లేదు. ఇంపార్టెన్స్‌ ఉంటేనే కాల్షీట్స్ ఇస్తోంది. దీనికి తోడు పారితోషికం కూడా 3కోట్లకు పైగానే అడుగుతోందట. అనుష్క ఇంతకుముందు సీనియర్ హీరోలకి ఒక ఆప్షన్‌గా కనిపించేది. కానీ స్వీటీ బరువు పెరిగాక సీనియర్లు కూడా ఈమెతో సినిమాలు చెయ్యట్లేదు. ఫేస్‌లో చార్మింగ్‌ లేదని, హీరోయిన్‌ లుక్‌లో కనిపించట్లేదని ఈమెని పక్కనపెట్టేశారు. ఇక స్వీటీ కూడా 'నిశ్శబ్ధం' సినిమా తర్వాత సినిమాలకి దూరమైంది. కాజల్‌ అగర్వాల్ వయసు 35 దాటినా యంగ్‌స్టర్స్‌, సీనియర్స్‌ ఇద్దరినీ కవర్‌ చేసేది. పెళ్లి తర్వాత కూడా చిరంజీవితో 'ఆచార్య', నాగార్జునతో 'ది ఘోస్ట్' సినిమాలకి సైన్ చేసింది. అయితే ఇప్పుడు కాజల్‌ ప్రెగ్నెంట్‌ అని తెలుస్తోంది. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇస్తుందట కాజల్.

నయనతార, అనుష్క, కాజల్‌ సినిమాలు తగ్గించడంతో తమన్న బిజీ అవుతోంది. సీనియర్‌ స్టార్స్‌కి ఈ హీరోయిన్ బెస్ట్‌ ఆప్షన్‌గా మారిపోయింది. చిరంజీవి, మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో 'భోళా శంకర్' అనే సినిమా వస్తోంది. ఈ మూవీలో తమన్నాని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇంతకుముందు తమన్న వెంకటేశ్‌తో 'ఎఫ్2' కూడా చేసింది.

శ్రుతీ హాసన్‌కి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. రవితేజ 'క్రాక్' సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన శ్రుతి పాన్‌ ఇండియన్‌ మూవీస్‌తో పాటు, సీనియర్స్‌తో కూడా సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో 'సలార్' చేస్తోన్న శ్రుతి, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా హీరోయిన్‌గా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత మాత్రం నిజమో తెలియాలి. మొత్తానికి తమన్నా.. శ్రుతిహాసన్ మంచి అవకాశాలే కొట్టేస్తున్నారు. రకరకాల కారణాలతో కొందరు సినిమాలకు దూరమవుతుంటే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. మరిన్న ఆఫర్లు అందుకుంటూ బిజీ అయిపోతున్నారు. మనం కూడా ఆ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.





 


మరింత సమాచారం తెలుసుకోండి: