మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను చకచక పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ప్రచార చిత్రాలను చిత్ర బృందం బయటకు వదలగా వాటికి జనాలు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

సినిమా షూటింగ్ ను కూడా చిరంజీవి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇలా ఈ రెండు సినిమాలను చకచకా పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాను కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇలా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో కూడా ఒక సినిమాలో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో ఒక పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం ఈ సినిమా ఓపెనింగ్ మరియు పూజ సమయాన్ని ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది.  06.12.2021 నాడు 11.43 నిమిషాలకు ఓపెనింగ్ మరియు పూజ అంటూ చిత్ర బృందం తెలియజేసింది. ఇలా చిత్రబృందం విడుదల చేసిన ఈ పోస్టర్ తోనే జనాలలో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: