1990 ప్రాంతాలలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన రాజశేఖర్ ఒక దశాబ్దం పాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు. ఆతరువాత వచ్చిన ఫ్లాప్ తో తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాడు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ సీనియర్ హీరోగా సెటిల్ కావాలని తెగ  ప్రయత్నిస్తున్నప్పటికి అతడి ప్రయత్నాలకు విజయాలు రావడంలేదు.


ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ తీసుకున్న ఒక నిర్ణయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీపడటానికి ప్రభాస్ పవన్ కల్యాణ్ మహేష్ బాబుల సినిమాలు ఇప్పటికే లైన్ కట్టి ఉన్నాయి. వీటిలో ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’  మూవీలు రావాలా వద్దా అనే మీమాంసలో ఉన్నాయి.


ఇలాంటిపరిస్థితులలోసంక్రాంతి రేస్ లో తాను కూడ ఉన్నాను అంటూ తన లేటెస్ట్ మూవీ ‘శేఖర్’ ను లైన్ లోకి దింపడం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఈవిషయంలో రాజశేఖర్ చేస్తున్నది సాహసం అనుకుంటే ఆయనకు థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ సినిమా కూడ సంక్రాంతికి  వస్తుందంటూ అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి ఫీలర్లు వస్తున్నట్లు టాక్.


రాజశేఖర్ కెరియర్ లో 91వ చిత్రంగా రుపొందుతున్న ఈ మూవీ మళయాళంలో సూపర్ హిట్టయిన ఒక సినిమాకు రీమేక్ గా వస్తోంది. నూతన దర్శకుడు లలిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రాజశేఖర్ ఈ సాహసం చేయడం వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాతో థియేటర్స్ దొరకక మహేష్ పవన్ సినిమాలు వెన్నక్కు వెళ్ళితే  సంక్రాంతి రేస్ లో  రాజమౌళి ప్రభాస్ సినిమాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీనితో మూడవ సినిమాగ తన సినిమా విడుదలైతే తన సినిమాకు మినిమమ్ కలెక్షన్స్ గ్యారంటీ అన్న ఉద్దేశంతో రాజశేఖర్ ఇలా సాహసం చేస్తున్నాడు అనుకోవాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: