ఈ సినిమా నుండి విడుదలైన లాహే సాంగ్కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇక ఇప్పుడు మెలోడీ సాంగ్గా 'నీలాంబరి..' సాంగ్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలో రామ్చరణ్, పూజా హెగ్డే జంటగా కనిపిస్తారు. కాగా.. లిరికల్ వీడియోలో సాంగ్కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్, పాట చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా అందుబాటులో పెట్టారు. అయితే ఈ సాంగ్ విడుదల అనంతరం మెగాస్టార్ చిరంజీవి పాటపై స్పందించి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ పాటకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్ర పాడారు. అంతేకాదు.. ఈ పాటను అనంత శ్రీరాం రాశారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్కు, లాహే సాంగ్కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు నీలాంబరి పాటకు కూడా అంతే స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ సినిమా నుండి వచ్చే ప్రతి పాట మెగాభిమానులనే కాదు, ప్రేమికులకు కూడా మెప్పించేలా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపారు. అయితే ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా నిర్వహిస్తున్నారు.