నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు, అనుకున్నది అనుకున్నట్లుగా కుదిరితే ఈ సినిమా ను డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా అనేక వార్తలు బయటకు వచ్చాయి, ఇదిలా ఉంటే ఇప్పటికే బాలకృష్ణ కోసం అదిరిపోయే కథను రెడీ చేసి దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నాడు.

 ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసిన గోపీచంద్ మలినేని ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇప్పటికే బాలకృష్ణ సరసన హీరోయిన్ ని కన్ఫామ్ చేసిన గోపిచంద్ మలినేని అదే స్పీడ్ లో బాలయ్య కు ధీటుగా నిలబడే విలన్ ను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  కన్నడ లో ఊర మాస్ హీరోగా సినిమాలు చేసే దునియా విజయ్ ని బాలయ్య-గోపీచంద్ సినిమా కోసం విలన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. దునియా విజయ్ కోసం అదిరిపోయే పవర్ఫుల్ విలన్ రోల్ ని ఈ దర్శకుడు గోపీచంద్ మలినేని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమా కోసం అదిరిపోయే నటీనటులను సెట్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: