నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు మాస్ దర్శకులలో ఒకరు ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాను పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి అనుకోవచ్చు. ఇదిలా ఉంటే అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది, ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఇలా ఇప్పటికే ఒక క్రేజీ సినిమాను పూర్తి చేసిన బాలకృష్ణ మరో క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టి షూటింగ్ కు రెడీ గా ఉన్నాడు. అయితే ఈ రెండింటితో పాటు టాలీవుడ్ లో కామెడీ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకొని ఒక్క పరాజయం కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బాలకృష్ణ అఖండ సినిమాకు ముందు కొన్ని పరిచయాలు పలకరించిన అఖండ సినిమా తర్వాత మాత్రం ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తన హవాను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ త్రీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు, ఈ సినిమా పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ సినిమా మొదలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: