ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ క్వీన్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ అనుష్కకు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన  పాత్ర లతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి.


 కాగా నేడు అనుష్క పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు సైతం అనుష్కకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ క్వీన్ గా కొనసాగుతున్న అనుష్క కెరీర్ మొదటి నుంచి టాలీవుడ్ ప్రేక్షకుల దేవసేన వరకు ఎలాకొనసాగింది ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అనుష్క. అంతకు ముందు యోగా టీచర్గా పని చేసేది. అది పూరి జగన్నాథ్ కు బంధువులు ఎవరో చెప్పడంతో అనుష్కను ఆడిషన్ కి పిలిచారు. ఇక అనుష్క ఆడిషన్ నచ్చడంతో ఆమె ఫోటోలు ఇవ్వు అని అడగగా.. పాస్ ఫోటో ఇచ్చిందట అనుష్క. దీంతో పూరి జగన్నాథ్ షాక్ అయ్యాడట.



 ఇక ఆ తర్వాత నాగార్జున ప్రోత్సాహంతో సూపర్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ఎన్నో గ్లామర్ పాత్రల్లో కూడా నటించింది. అనుష్క ప్రభాస్ జోడి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారింది. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇక ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది అనుష్క.


 ఇక బాహుబలి సినిమాలో అనుష్క ఎంత గుర్తింపు సంపాదించుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాలో అనుష్క నటించిన దేవసేన పాత్ర తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక అనుష్క లావు పెరగడం తో కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో భాగమతి అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత నిశ్శబ్దం అనే లేడి ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే చాలా రోజులుగా అభిమానులు అనుష్క సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలా ఒక యోగా టీచర్ నుంచి ఏకంగా తెలుగు తెలుగు ప్రేక్షకుల దేవసేన గా మారిపోయింది అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి: