ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ ఎన్నో ఏళ్ల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇక జబర్దస్త్ కార్యక్రమం లో ఎప్పుడూ ఏదో ఒక జంట హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి సుడిగాలి సుధీర్ రష్మీ జంట ఎంతో క్రేజ్ సంపాదించింది అన్న విషయం తెలిసిందే. వీరి క్రేజ్ కారణంగానే కొన్నాళ్లపాటు జబర్దస్త్ కార్యక్రమానికి మంచి రేటింగ్ వచ్చింది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమాలు కొనసాగుతుండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ జోడి గా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.


 ఇక జబర్దస్త్ కార్యక్రమం లో హైపర్ ఆది యాంకర్ అనసూయ కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం యాంకరింగ్ మాత్రమే చేయకుండా అప్పుడప్పుడు హైపర్ ఆది స్కిట్ లో భాగం అవుతూ తనదైన శైలిలో వుంటుంది అనసూయ. ఇక ఇటీవల మరోసారి హైపర్ ఆది స్కిట్ లో కామెడీ తో అదర గొట్టింది అనసూయ. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా అనసూయను ఇంప్రెస్ చేయడానికి ఏకంగా క్యాండిల్ లైట్ డిన్నర్ జబర్దస్త్ స్టేజ్ పై ఏర్పాటు చేస్తాడు హైపర్ ఆది.



 అంతేకాదు అనసూయను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో పంచ్ డైలాగులు కూడా చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఒక టేబుల్ పై కూర్చుంటారు అనసూయ, హైపర్ ఆది. ఇక వీరి మధ్య జరిగే సంభాషణలు కూడా అటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి అని చెప్పాలి. అయితే ఎన్నో స్కిట్ లలో కూడా ఇలా అనసూయను మెప్పించడానికి పంచు డైలాగులు చెబుతూ ఉంటాడు హైపర్ ఆది. ఇక ఈ సారి మాత్రం కాస్త కొత్తగా అనసూయను ఇంప్రెస్ చేయడానికి  హైపర్ ఆది భలే ప్లాన్ చేసాడు అని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ ప్రోమో చూస్తే ఈ వారం కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్క అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: